మాహిష్మతి సామ్రాజ్యం సైజులో అమరావతి!
- December 26, 2016 / 01:08 PM ISTByFilmy Focus
త్రేతాయుగంలో ఏవైనా రాజ్యాలు నిర్మించాలన్నా, వ్యవస్థను స్థాపించాలన్న ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రముఖులైన శిల్పులను పిలిపించుకొనేవారు రాజులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. నవ్యాంధ్రకు పునాదిరాయి లాంటి అమరావతిని ప్రపంచంలో అత్యంత ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ఆశయం. అందుకోసం తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాక సినిమా అభిమానులందరూ ఎంతో ముద్దుగా “జక్కన్నా” అని పిలుచుకొనే రాజమౌళిని ఎన్నుకొన్నాడు చంద్రబాబు.
“బాహుబలి” సినిమాలో మాహిష్మతి రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో కళా దర్శకుడు సాబుసిరిల్ తోపాటు దర్శకుడు రాజమౌళి కళా నైపుణ్యం కూడా కొంత ఉంది. అందుకే రాజమౌళి అయితే.. అమరావతికి కూడా మాహిష్మతిని తలదన్నే అద్భుతమైన ప్లానింగ్ ఇస్తాడని విశ్వసించి ఆ బాధ్యతను రాజమౌళికి అప్పగించడం జరిగిందని సమాచారం. అయితే.. ఈ విషయమై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను సంప్రదించగా.. అమరావతి ప్లానింగ్ విషయంలో రాజమౌళి ప్రమేయం ఏమీ ఉండబోదని చెబుతున్నారు. అయితే.. అప్పుడే మేటర్ బయటకు వచ్చేస్తే బాగోదనే ఆలోచనతోనే అలా కవరింగ్ చేస్తున్నారని చెవులు కోరుక్కొంటున్నారు!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















