Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

రాజమౌళి  (S. S. Rajamouli) డైరెక్షన్‌లో మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న ‘SSMB29’ సినిమా గురించి రోజూ కొత్త అప్‌డేట్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా Priyanka Chopra)  , పృథ్వీరాజ్ సుకుమారన్  (Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి సినిమా అంటే ఎప్పుడూ భారీ అంచనాలే. ఈ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో సందడి చేయడం ఖాయం అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Rajamouli

ఈ సినిమా షూటింగ్‌కి త్వరలో 45 రోజుల బ్రేక్ ఇవ్వబోతున్నారట. ఈ గ్యాప్‌లో రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంటారని సమాచారం. రాజమౌళి ఎప్పుడూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తారు. ‘బాహుబలి’ (Baahubali), ‘RRR’ (RRR)  సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న, ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. తాజాగా, రాజమౌళి, కార్తికేయ ప్రపంచంలో నెంబర్ వన్ వీడియో గేమ్ క్రియేటర్ హిడియో కోజిమాతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు.

జపాన్‌కు చెందిన హిడియో గేమింగ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ మీటింగ్ ఫోటోను హిడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ మీటింగ్ మహేష్ సినిమా కోసమేనని, హిడియో ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

హిడియో కోజిమా లాంటి గ్లోబల్ టాలెంట్‌తో రాజమౌళి కలిసి పనిచేస్తే సినిమా స్థాయి ఇంకో లెవెల్‌లో ఉంటుందని అంటున్నారు. యాక్షన్ స్టంట్స్ కోసం అతన్ని తీసుకునే అవకాశం ఉంది. ఈ జూమ్ కాల్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా, ఈ సినిమా గురించి రోజూ కొత్త అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానుల్లో హైప్ పీక్స్‌లో పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus