రానా ‘హిరణ్య కశ్యప’గా చూపించనున్న గుణశేఖర్ ?
- July 11, 2017 / 02:06 PM ISTByFilmy Focus
‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ హిరణ్య కశ్యప అనే టైటిల్ ని గత ఏడాది రిజిస్టర్ చేయించారు. కానీ హీరో ఎవరు? ఎప్పుడు తీస్తారు ? అనే విషయాలు బయటికి రాలేదు. తాజాగా ఆ పాత్రను రానా పోషించనున్నట్లు తెలిసింది. బాహుబలిలో భల్లాల దేవుడిగా మెప్పించిన రానా .. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి కొత్త కథలను ఎంపిక చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. తాజాగా పౌరాణిక కథకు ఒకే చెప్పి వార్తల్లో నిలిచారు. ఈ ప్రాజక్ట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని గుణశేఖర్ ఫిక్స్ అయ్యారు.
రానాపై వంద కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ సినిమా నిర్మాణంలో రానా తండ్రి సురేష్ బాబు కూడా భాగస్వామ్యం కావడానికి ఒకే చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించే కీలక నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికలో గుణశేఖర్ బిజీగా ఉన్నారు. ఆ పేర్లు ఖరారు కాగానే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















