ఎన్టీఆర్ తో పోటీ కి సిద్ధమైన రవితేజ
- June 7, 2017 / 07:06 AM ISTByFilmy Focus
మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలు ఎన్టీఆర్, రవితేజ. వీరిద్దరూ పోటీకి దిగుతున్నారు. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ కూడా ఒకే సారి రాజా ది గ్రేట్, “టచ్ చేసి చూడు” సినిమాలు చేస్తున్నారు. ఏడాది తర్వాత చేస్తున్న ఈ చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నటచ్ చేసి చూడు మాత్రం పూర్తి యాక్షన్ మూవీ. ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి రవితేజ పోటీ ఇస్తున్నారు.
ఎలాగంటే జై లవకుశ టీజర్ ను రంజాన్ కి రిలీజ్ చేయాలనీ ఎన్టీఆర్ భావిస్తున్నారు. అదే రోజు తన కొత్త సినిమా “టచ్ చేసి చూడు” ఫస్ట్ లుక్ టీజర్ ను లాంచ్ చేయాలని రవితేజ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అవగానే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది. అదే రోజు రవితేజ టీజర్ కూడా వస్తే ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇలా ఎన్టీఆర్ కి రవితేజ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాల టీజర్ రిలీజ్ గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















