ఎన్టీఆర్, బాబీ రెగ్యులర్ షూటింగ్ అందుకే ఆలస్యం అవుతోంది !
- February 18, 2017 / 06:52 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలి. కానీ వాయిదా పడింది. ఎందుకు పోస్ట్ పోన్ అయిందని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ లో తారక్ మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించనున్నారు. నటనలో వేరియేషన్స్ మాత్రమే కాకుండా బాడీలోను మార్పులు కనిపించాలని హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నారు. అతను ఎన్టీఆర్ బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అమెరికాలో స్టూడియోకి వెళ్లారు.
అక్కడ తారక్ గెటప్స్ పై ఓ నిర్ణయానికి రాబోతున్నారు. హార్ట్ వెల్ వచ్చే వారం హైదరాబాద్ కి రాబోతున్నారు. అప్పుడు క్యారక్టర్ రూపం పై తుది నిర్ణయం చెప్పనున్నారు. అనంతరం ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. అందుకే వారం పాటు ఆగినట్లు తెలిసింది. “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ పనిచేస్తున్నారు. భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















