పవన్ మూవీపై ఆ ప్రచారం నిజం కాదా..?

  • March 8, 2021 / 11:21 AM IST

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయిన తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో వరుస సినిమాలకు కమిటవుతున్న పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎం రత్నం ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని..

ఈ సినిమా మినీ బాహుబలి అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవర్ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ను తెలుసుకునేందుకు పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఈ నెల 11వ తేదీన మహాశివరాత్రి కానుకగా ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 11వ తేదీన పవన్ క్రిష్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఉండదని తెలుస్తోంది.

మరో తేదీన ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ బయటకు రానుందని సమాచారం. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే టైటిల్ ఫైనలైజ్ అయినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. పవన్ ఈ సినిమాలో వజ్రాల దొంగగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతుండగా ఈ మూవీ కోసం చార్మినార్ సెట్ వేశారు. పవన తన సినీ కెరీర్ లో తొలిసారి చారిత్రాత్మక కథలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus