బాధలోనుంచి పుట్టిన శతమానంభవతి!!!
- February 10, 2017 / 06:20 AM ISTByFilmy Focus
ఒక పక్క సంక్రాంతి హంగామా..మరో పక్క రెండు భారీ సినిమాలు….ఇద్దరు బడా హీరోలు….రెండు ప్రతిష్టాత్మక 100 150 సినిమాలు…అసలే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సునామీ వస్తుంది అని అనుకున్న తరుణంలో మెల్లగా…..చీకట్లో దొంగోడు అంటారుగా….అలా ఎవ్వరికీ కనిపించి….కనిపించనట్లుగా….ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా….అలా వచ్చి సూపర్ సక్సస్ అందుకోవడమే కాకుండా 30 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేసిన చిత్రం ‘శతమానం భవతి’ ….అయితే సినిమా బావుంటే హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండవచ్చు కానీ….ఇలాంటి సమయంలో కూడా సినిమాను హిట్ చెయ్యడం అంటే…కత్తి మీద సామే అని చెప్పాలి….అయితే ఈ సినిమా గురించి….ఏ సినిమా కధ గురించి…అసలు సినిమా కధ లేఆ పుట్టిందో అన్న విషయాలను మనతో పంచుకున్నాడు దర్శకుడు సతీష్…ఒకానొక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సతీష్ తన సినిమా ఏ బాధలోంచి పుట్టుకు వచ్చింది అన్న విషయాన్ని లీక్ చేసాడు.
విషయంలోకి వెళితే….మొదట్లో ఈసినిమా కథను విన్న తరువాత యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్ రాజ్ తరుణ్ లు తిరస్కరించిన తరువాత తాను విపరీతమైన అయోమయానికి లోనైనా విషయాన్ని బయట పెట్టాడు సతీష్. అయితే ఈకథ చాల సున్నితమైనదని అంటూ 17 ఏళ్ల క్రితం తాను ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు తాను సంక్రాంతి పండుగకు తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళలేకపోయినప్పుడు ఆ బాధ నుంచి వచ్చిన కథ ఈ ‘శతమానం భవతి’ అని అంటున్నాడు. తాను ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా క్లైమాక్స్ టైంలో ఈ కథను హీరో జగపతి బాబుకు చెపితే ఇది సినిమాగా కన్నా షార్ట్ ఫిలింగా బాగుంటుంది అని కామెంట్ చేసినప్పుడు తనకు బాధకలిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు సతీష్ వేగేశ్న. ఇలా తనలోని బాధను అందరితో పంచుకునే క్రమంలో ఎమోషన్ అయ్యాడట సతీష్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















