మార్చి వరకూ మరొకటి మొదలెట్టడట!
- December 2, 2016 / 06:10 AM ISTByFilmy Focus
2014, 2015 సంవత్సరాలలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తూ మిగతా నిర్మాణ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించిన “వారాహి చలన చిత్రం” సంస్థ నుంచి చివరిగా వచ్చిన సినిమా “జ్యో అచ్యుతానంద”. ఈ సినిమా విడుదలై యావరేజ్ గా నిలిచిన అనంతరం ఈ సంస్థ నుంచి మరో సినిమా ఎనౌన్స్ కాలేదు. పోనీ ఏవైనా ప్రోజెక్టులు ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్నాయా అంటే అదీ లేదు. ఉన్నట్లుండి ఎందుకింత సైలెంట్ అయిపోయారా అని వాకబు చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే…
గత కొద్ది సంవత్సరాలు వరుస సినిమాలు తీస్తూ అలసిపోయిన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి కొద్దిగా విరామం తీసుకోవాలనుకొన్నారని అందుకే వచ్చే ఏడాది మార్చి వరకూ సినిమా నిర్మాణాలవైపు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడని వినవొచ్చింది. అయితే.. కొంతమంది మాత్రం మోడీ ఎఫెక్టే ఇందుకు కారణమని, అన్నీ ట్రాన్సాక్షన్స్ వైట్ మనీతో చేయడం ఈ భళ్లారి బాబుకి కష్టం కాబట్టి ఈలోపు సొమ్ములు కూడగట్టుకొని వచ్చే ఏడాది నుంచి మళ్ళీ నిర్మాణాలు చేపడటాడని చెప్పుకొంటున్నారు. ఏది నిజమో తెలియదు కానీ.. “వారాహి” వారు ఇన్నాళ్ల గ్యాప్ ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














