Sai Pallavi: ‘సిరివెన్నెల’ సాంగ్ పై సాయిపల్లవి రియాక్షన్!

  • December 8, 2021 / 01:07 PM IST

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో పాటలు రాసారు. హీరో నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలను రాశారు. అయన రాసిన చివరి పాటను ఈరోజు విడుదల చేశారు. ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది .

దీనిపై నటి సాయి పల్లవి స్పందిస్తూ.. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ”సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. మీరు రాసిన ప్రతి పదం మీ సోల్ ని క్యారీ చేస్తుంది. మీరెప్పటికీ మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్” అంటూ రాసుకొచ్చింది సాయిపల్లవి. ఈ పాట ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 24న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవితో పాటు కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus