చైతూ కంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది..!
- February 27, 2020 / 07:59 PM ISTByFilmy Focus
అక్కినేని వారి ఇంటి కోడలు సమంత గురించి ఆమె క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే..! సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ ల స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు క్రేజ్ ఉన్న హీరోయిన్ పరిస్ధితి రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఇక స్టార్ హీరోయిన్ పరిస్ధితి కూడా అంతే..! ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. అలాంటిది అక్కినేని వారి ఇంటికోడలు సమంత ఏకంగా దశాబ్దకాలం నుండీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అంతేకాదు పెళ్ళైన తరువాత ఏకంగా సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటూ .. మరింతగా క్రేజ్ ను పెంచుకుంది.

ఇదిలా ఉంటే … ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫిబ్రవరి 26 తో 10 సంవత్సరాలు పూర్తయ్యింది. చైసామ్ కలిసి నటించిన ‘ఏమాయ చేసావా’ చిత్రం 2010 ఫిబ్రవరి 26 న విడుదలయ్యింది. ఇక ఈ చిత్రంలో సమంత నటన కే ఎక్కువ మార్కులు దక్కాయట. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు. అవును ‘ఏమాయ చేసావే’ చిత్రంలో సమంత కు 51 మార్కులు ఇవ్వాలి.. ఇక చైతన్య కు 49 మార్కులు ఇవ్వాలి అని ఆయన చెప్పారట’. అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేస్తూ సమంత ఈ వీడియోని పోస్ట్ చేసి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక అక్కినేని నాగేశ్వర రావు గారితో ‘మనం’ సినిమాలో కలిసి నటించింది సమంత.
❤️🙏 my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC
— Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!















