Jr NTR, Samantha: ఆ షోకు హోస్ట్ గా చేస్తానన్న సమంత.. కానీ?

  • October 16, 2021 / 08:48 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో బృందావనం. జనత గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. నిన్న ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సెలబ్రిటీ గెస్ట్ గా సమంత హాజరై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలను చెప్పి సమంత జీనియస్ అనిపించుకున్నారు. ఇతర సెలబ్రిటీలలా సమంత కూడా ఈ షోలో 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

సమంత మాట్లాడుతూ ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్ కు తాను కూడా హోస్ట్ గా ఒక ఆప్షన్ గా ఉండవచ్చని ఎన్టీఆర్ కు చెప్పారు. జెమినీ టీవీకి నేను ఉన్నానంటూ సమంత చెప్పగా షాకవ్వడం తారక్ వంతయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు తర్వాత సీజన్ కు సమంత హొస్ట్ అని ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు డిక్లేర్ చేయనా? అని అడుగుతాడు. ఆ తర్వాత మీ ఫ్యాన్స్ కు చెప్పవద్దంటూ సమంత దండం పెడతారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ బంగారాలు అని కామెంట్లు చేస్తారు. ఎన్టీఆర్ ఈరోజు ఆట అయిపోయిందని చెప్పగా సమంత నాకు కోటి రూపాయలు ఇవ్వరా? అని అడుగుతారు. ఎన్టీఆర్ సమాధానంగా ఇవ్వరని చెబుతారు. అప్పుడు ఎందుకు చెక్కులు ఎక్కువగా పెట్టారని ఇక్కడ గొడవ జరుగుతుందని సమంత కామెంట్లు చేస్తారు. ఆ తర్వాత 12,50,000 రూపాయలకు చెక్కు రాస్తున్నానంటూ ఎన్టీఆర్ సమంతను ఏడిపిస్తారు. ఈ షో ద్వారా ఎన్టీఆర్, సమంత ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ అందించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus