Samantha: రాజీ కథ ఎంతో అవసరం : సమంత

  • June 5, 2021 / 03:21 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కీలకపాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజీ అనే పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతను తెగ పొగిడేస్తున్నారు. దీంతో సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా అందరికీ థాంక్స్ చెబుతూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు.

ఈ సిరీస్ కు వస్తోన్న కామెంట్స్, రివ్యూలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ​ఈ సిరీస్ లో తను పోషించిన రాజీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఈ సిరీస్ గురించి దర్శకులు రాజ్ అండ్ డీకే తనను సంప్రదించిన్నప్పుడు.. రాజీ పాత్ర పోషించడానికి సెన్సిటివిటీ, బ్యాలెన్స్ ఎంతో అవసరమనుకున్నానని చెప్పారు. ఈలం యుద్ధంలో తమిళుల పోరాటాలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసే కొన్ని డాక్యుమెంటరీలను క్రియేటివ్ టీమ్ తనకు పంపించిందని చెప్పింది.

వాటిని చూసి తను ఎంతో భయపడ్డానని.. వాళ్ల కష్టాలు, కన్నీటి గాథలను చూసి బాధపడ్డానని చెప్పారు. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు ప్రపంచం వాళ్ల వైపు కూడా చూడలేదని.. రాజీ కథ కల్పితం అయినప్పటికీ.. అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి.. ఆ బాధాకరమైన జ్ఞాపకాల్లో జీవిస్తున్న వారికి ఇదొక నివాళి అని చెప్పారు. రాజీ కథ మనకు ఎంతో అవసరమని చెప్పారు.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus