శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన ఆరోపణలు
- September 9, 2020 / 09:57 PM ISTByFilmy Focus
అత్యంత ప్రజాదరణ కలిగిన తెలుగు సీరియల్స్ లో మనసు మమత ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న శ్రావణి మంగళవారం సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. ఆమె మరణం బుల్లితెర పరిశ్రమను షాక్ కి గురి చేసింది. కెరీర్ పరంగా ఎదురైన ఇబ్బందులే ఆమె చావుకు కారణం అని అందరూ భావించారు. ఐతే శ్రావణి చనిపోవడానికి కారణం ఆమెకు ఓ వ్యక్తి నుండి ఎదురైన వేధింపులే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం కూడా జరిగింది.
కాకినాడలోని గొల్లప్రోలు ప్రాంతానికి చెందిన దేవరాజ్ రెడ్డి, శ్రావణిని మానసికంగా వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దేవరాజ్ తో శ్రావణి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయడం వలెనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఆరోపణలపై దేవరాజ్ రెడ్డి స్పందించారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు శ్రావణిని తాను వేధించ లేదని అన్నారు. అలాగే మూడు రోజులలో శ్రావణి తనవద్దకు వస్తానని చెప్పిందని దేవరాజ్ రెడ్డి చెప్పారు.

సాయి అనే వ్యక్తితో పాటు, కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి చెప్పి సంచలనానికి తెరలేపారు. ఇక తాను పోలీసులకు ముందు హాజరు కావడంతో పాటు, ఈ కేసు విచారణకు సహకరిస్తానని దేవరాజ్ రెడ్డి చెప్పడం గమనార్హం. దేవరాజ్ రెడ్డి వివరణ తరువాత శ్రావణి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనే సందిగ్దత మొదలైంది.
Most Recommended Video
బిగ్బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్బాస్ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?
















