షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓకే జాను’
- May 31, 2016 / 11:25 AM ISTByFilmy Focus
తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ‘ఓకే బంగారం’ .. హిందీ లో ‘ఓకే జాను’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడక్షన్స్ పతాకం పై కరణ్ జోహర్ ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్ లు జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు నిర్మాత కరణ్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా పేర్కొన్నారు.
షాద్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శ్రద్దా, ఆదిత్యాలు చివరి సారి ‘ఆషికి 2’ లో జంటగా నటించారు. మరోవైపు ‘ఓకే జాను’ చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో.. మొహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ చిత్ర షూటింగ్ లో శ్రద్ధా పాల్గొనే అవకాశం ఉంది.
#OKJAANU wraps!!! @ShraddhaKapoor #AdityaRoyKapur #ManiRatnam #Gulzar #ARRahman #Shaad pic.twitter.com/gH8bKBctqu
— Karan Johar (@karanjohar) May 30, 2016













