Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్ కామెడీకి ఓకే చెప్పాడట
- February 26, 2026 / 02:23 PM ISTByFilmy Focus Desk
తెలుగు యువ హీరోలయందు శ్రీవిష్ణు వేరయా! – ఈ మాట చెప్పడానికి ఎవరికీ, ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఈ మాట అనలేకపోతున్నారు అంటే ఆయన సినిమాలు ఇప్పటివరకు చూడలేదు అని అర్థం. యాక్షన్ ఇమేజ్, లవర్ బాయ్ ఇమేజ్ కోసం ఆయన వరుస సినిమాలు చేసిన రోజుల్లో ‘ఇదేంటి శ్రీవిష్ణు ఇలా చేస్తున్నాడు’ అనే మాట వినిపించింది. ఎప్పుడైతే ఆయన కామెడీ జోనర్లోకి వచ్చాడో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకటి అరా సినిమా తేడాకొట్టినా వరుస విజయాల మధ్యలో అది మాసిపోయింది.
Sree Vishnu
అంతలా కామెడీ సినిమాలను అదరగొట్టేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ క్రమంలో తనకు ‘సామజవరగమన’ లాంటి బ్లాక్బస్టర్ సినిమాను ఇచ్చిన రామ్ అబ్బరాజు డైరక్షన్లో మరో సినిమాకు ఓకే చెప్పాడు. కొన్ని నెలల క్రితమే ఆ సినిమా అనౌన్స్మెంట్, పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా పనులు అయిపోవడంతో ఆయన ఖాళీ అయ్యారు. దీంతో శ్రీవిష్ణు సినిమా పనుల వేగం పెంచారట. ఈ క్రమంలో సినిమా జోనర్ బయటకు వచ్చింది. అదే డార్క్ కామెడీ.

ఇక్కడ డార్క్ కామెడీ అంటే అదేదో ఇబ్బందికర సినిమా అనుకునేరు. సెటైర్లు, కౌంటర్లు, సామాజిక అంశాలను చూపించే కథలు అన్నమాట. అయితే ఆ విషయాలను సీరియస్ టోన్లో కాకుండా కాస్త నవ్విస్తూ చెబుతారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందట. ‘మోగ్లీ’ సినిమాతో ఇటు నటన, అటు అందంతో ఆకట్టుకున్న సాక్షి మదోల్కార్ను ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారట. ఇక ఇందులో సుదర్శన్, వెన్నెల కిశోర్ లాంటి హై కామెడీ యాక్టర్లు కూడా ఉండనున్నారు.
ఇక శ్రీవిష్ణు సినిమాల విషయానికొస్తే.. ఫిబ్రవరి 27న ‘విష్ణు విన్యాసం’ సినిమాల థియేటర్లలోకి వస్తుంది. మార్చి 6న ‘మృత్యుంజయ’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటి తర్వాత ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాను తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ డార్క్ కామెడీ సినిమా వస్తుందన్నమాట.












