Rajamouli: జక్కన్న షాకింగ్ ప్లాన్.. ఆ పని చేయబోతున్నారా?

  • March 18, 2023 / 02:31 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆస్కార్ అవార్డ్ రావడానికి ప్రమోషన్స్ కోసం ఏకంగా 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ మొత్తం ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కింది. ప్రపంచ దేశాల ప్రజల్లో ఈ సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి మరోసారి చర్చ జరగడం గమనార్హం.
అయితే జక్కన్న ఆస్కార్ కోసం ఎక్కువ మొత్తం ఖర్హు చేసినా ఆ మొత్తం సులువుగానే రికవరీ కానుందని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న మూవీకి హలీవుడ్ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని హాలీవుడ్ పెట్టుబడులు వస్తే జక్కన్న పెట్టుబడితో పోల్చి చూస్తే మూడు నుంచి నాలుగు రెట్లు లాభాలు ఖాయమని సమాచారం అందుతోంది. తాజాగా మహేష్ రాజమౌళి కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సైతం సినిమా సినిమాకు మార్కెట్ పెరగాలని మరిన్ని రికార్డులు సొంతం కావాలని భావిస్తున్నారు.

మహేష్ సినిమాతో చరిత్ర తిరగరాయాలని జక్కన్న భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మహేష్ సైతం రాజమౌళి డైరెక్షన్ లో పని చేయడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. జక్కన్న విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి 200 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న తొలి డైరెక్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి భారతీయ సినిమాల ఖ్యాతిని మరింత పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జక్కన్న ఎలాంటి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. రాజమౌళి సినిమాలలో స్క్రీన్ ప్లే స్పెషల్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. రాజమౌళి స్థాయిలో సక్సెస్ రేట్ ను పెంచుకోవాలని ఇతర భాషల డైరెక్టర్లు సైతం భావిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus