2020 పూర్తిగా అనర్ధాలు, అపశకునాలమయంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రపంచానికి నరకం పరిచయం చేస్తుంది. మరో వైపు చిత్ర పరిశ్రమపై పగబట్టి నట్టు కసి తీర్చుకుంటుంది. అద్భుత నటులు దర్శక నిర్మాతలను పొట్టనబెట్టుకుంది. బాలీవుడ్ లో రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో చనిపోగా.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్నారు. ఇక కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు.మరో కొందరు నటులు ఈ ఏడాది మరణించారు.
కాగా 2020 ఓ ప్రముఖ దర్శకుడిని కూడా మింగేసింది. మలయాళం దర్శకుడు సాచి నేడు తుదిశ్వాస విడిచారు. ఈయన పేరు సచ్చిదానందన్ కాగా సాచి అనే పేరుతో పాప్యులర్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం సాచికి గుండె పోటు రావడంతో తిరుచూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈయనకు గుండె ఆపరేషన్ కూడా జరుగగా వెంటిలేషన్ పై చికిత్స అందిస్తున్నారు.
నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. 2020లో విడుదలై భారీ విజయంతో పాటు విమర్శకుల ప్రసంశలు అందుకున్న అయ్యప్పనుమ్ కోశియమ్ డైరెక్టర్ సాచి కావడం విశేషం. 2015లో అనార్కలి చిత్రంతో డైరెక్టర్ గా మారిన సాచి డ్రైవింగ్ లైసెన్స్,రామ లీల, రన్ బాబీ రన్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు.
Most Recommended Video
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!