సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ మధ్య చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్ వంటి చాలా మంది సెలబ్రిటీలు మరణించారు. ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

Vikram Sukumaran

తమిళ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకుంది అని తెలుస్తుంది. ఓ దర్శకుడు కన్నుమూసినట్టు తెలుస్తుంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు.. అయినటువంటి విక్రమ్ సుకుమారన్ (Vikram Sukumaran) కన్నుమూశారు. గుండెపోటుతో ఈయన మరణించినట్లు తెలుస్తుంది. ఓ సినిమా షూటింగ్లో భాగంగా.. మధురై నుండి చెన్నైకి ట్రావెల్ చేస్తున్న టైంలో ఆయనకు గుండెపోటు వచ్చిందట. దీంతో సిబ్బంది హాస్పిటల్ కు తరలించే టైంలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు విక్రమ్ సుకుమారన్ (Vikram Sukumaran). మొదట్లో బాలు మహేంద్ర వద్ద పలు సినిమాలకు పనిచేశారు. అలాగే ‘పొల్లాదవన్’ ‘కోడి వీరన్’ వంటి సినిమాల్లో కూడా నటించారు. ‘ఆడుకలం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి రైటర్ గా కూడా పనిచేశారు. తర్వాత హీరో శంతును నటించిన ‘రావణ కొట్టం’ ‘మదయానై కొట్టం’ వంటి సినిమాలకి డైరెక్టర్ గానూ వ్యవహరించారు.

రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus