కీరవాణి కొడుకు సినిమా ఈవెంట్ వెనుక అంత కథ ఉందా?

  • March 20, 2021 / 06:34 PM IST

సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెల్లవారితే గురువారం.. సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మణికాంత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై రజని కొర్రపాటి – రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మిస్తున్నారు. మార్చి 27న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ఆర్.ఆర్.ఆర్ హీరో ఎన్టీఆర్ మరియు ఆ చిత్రం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హాజరుకాబోతున్నారు.

అయితే ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యమదొంగ చిత్రంతో తెల్లవారితే గురువారం చిత్రానికి ఓ లింక్ ఉందట. అదేంటి అంటే… 2007 లో వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ దొంగగా కనిపిస్తాడు. ఆ చిత్రంలో చిన్నప్పటి పాత్రలో ఓ కుర్రాడు కనిపిస్తాడు.అతను మరెవరో కాదు.. తెల్లవారితే గురువారం హీరో మరియు యమదొంగ సంగీత దర్శకుడు కొడుకు అయిన సింహానే..!

ఆ చిత్రంతో సంబంధం కలిగిన ఈ నలుగురు … ఇప్పుడు ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు అన మాట. ఆల్రెడీ మత్తు వదలరా చిత్రంతో హిట్ అందుకున్న సింహా.. ఈ చిత్రంతో మరో హిట్టు అందుకుంటాడేమో చూడాలి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus