సుశాంత్ పోస్ట్ మోర్టమ్ తర్వాత వైద్యులు తెలిపిన వివరాలు ఇవే..!
- June 15, 2020 / 02:46 PM ISTByFilmy Focus
హీరో సుశాంత్ సింగ్ నిన్న ఆత్మ హత్యకు పాల్పడి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను, అభిమానులను శోక సముద్రంలో ముంచివేశారు. ఆయన మరణించాడన్న విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

కాగా నేడు ఆయన మృతదేహానికి వైద్యులు పోస్ట్ మోర్టమ్ నిర్వహించారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆయన మరణం వెనుక ఎవరి ప్రమేయం లేదని తేల్చారు. ఆయన్ని హత్య చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన ఒంటిపై గాయాలకు కూడా లేవు అని తెలిపారు. దీనితో సుశాంత్ ఉరి వేసుకోవడం వలనే మరణించాడని వైద్యులు తేల్చారు. ఉరి కారణంగా ఆయన స్పైనల్ కార్డ్స్ దెబ్బ తినడంతో పాటు ఊపిరాడక మరణినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. నేడు సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!















