మాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా!!
- August 22, 2016 / 11:22 AM ISTByFilmy Focus
‘మిల్కీ బ్యూటీ తమన్నా మలయాళంలోకి “కమ్మరసంభవం’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు…, రితీష్ అంబట్ దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్న ఈ చిత్రంతో మాలీవుడ్కి తమన్నా పరిచయం కానున్నారు..’ అనే రూమర్లను తమన్నా ఖండించారు. తాను ఇప్పుడు ఏ సినిమాకు సంతకం చేయలేదని స్పష్టం చేశారు. “నేను ఏదైనా సినిమాకు సైన్ చేస్తే మీకు చెబుతాను. అబద్ధపు వార్తలను నమ్మొద్దు” అని ఆమె శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తమన్నా తమిళంలో నటించిన “ధర్మదురై” సినిమా శుక్రవారం విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. మిల్కీ బ్యూటీ టైటిల్ రోల్ పోషించిన అభినేత్రి (డెవిల్) మూవీ అక్టోబర్ లో రిలీజ్ కు సిద్ధమైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అందాల నటి ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటోంది. పోరాట సన్నివేశాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను చీల్చి చెండాడుతోంది. తమన్నా ప్రస్తుతం పూర్తిగా బాహుబలి కోసమే సమయం కేటాయించారని, ఆ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాతనే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తారని ఆమె సన్నిహితులు వెల్లడించారు.
When I sign a new film , I will tweet abt it .
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 20, 2016












