స్టార్ హీరోను అరెస్ట్ చేయమని ఆదేశించిన హైకోర్ట్
- May 7, 2019 / 09:48 PM ISTByFilmy Focus
గతంలో సినీనటుల సంఘానికి శరత్కుమార్ అధ్యక్షునిగా.. రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. వారి హయంలో కాంచీపురం జిల్లా వెంకటమంగళంలో ఉన్న సినీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. 3 నెలల్లో స్థల విక్రయం కేసును తేల్చి శరత్కుమార్, రవిలను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నడిగర్ సంఘానికి హీరో విశాల్ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించి, డాక్యుమెంట్లలో మార్పులు
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
చేసి యూనియన్కు చెందిన ఆస్తిని అక్రమంగా విక్రయించారని విశాల్ కూడా ఆరోపించాడు. కొన్నినెలల క్రితమే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. తన వాదనలకు బలం చేకూరేలా ఆధారాలు ఉంటే వాటితో కేసు నమోదు చేయొచ్చని కోర్టు విశాల్కు సూచించింది. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు అవసరమైతే వారిద్దరి అరెస్ట్ చేసి వారిని విచారించాలని కాంచీపురం క్రైమ్ బ్రాంచ్కు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












