తెలుగు జర్నలిజం రంగంలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం అంటే జూన్ 27 న రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలోని జవహర్ నగర్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంతో తెలుగు మీడియా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్వేచ్చ స్నేహితులు, కొలీగ్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. స్వేచ్ఛలో యాంకర్ మాత్రమే కాదు.. కవి కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది స్వేచ్ఛ.
తను పనిచేస్తున్న ఓ ఛానెల్పై ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లి పోరాడింది. అలాంటి ధైర్యవంతురాలు.. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఇబ్బందులే స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం అనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. స్వేచ్ఛకు 2014లోనే వివాహం అయ్యింది. ఓ కుమార్తె కూడా ఉంది. అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.
యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛకి పూర్ణ చందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు దగ్గరయ్యాడు. వాస్తవానికి అతనికి కూడా పెళ్ళై, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ‘భార్యకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని స్వేచ్ఛకి అతను మాట ఇచ్చినట్లు టాక్. విడాకుల తర్వాత కొన్నిరోజులు రాంనగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివసించిన స్వేచ్ఛ.. పూర్ణ చందర్ పరిచయం తర్వాత తన కుమార్తెతో కలిసి జవహర్ నగర్లో ఓ పెంట్హౌస్ కి షిఫ్ట్ అయ్యిందట.
అదే ఇంట్లో పూర్ణ కూడా వీరితోనే ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. రోజులు గడుస్తున్నా పూర్ణ చందర్ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. అవి పెరగడంతో పూర్ణ చందర్తో బ్రేకప్ చెప్పేసిందట స్వేచ్ఛ. ఇవి జరిగిన కొద్దిరోజులకే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. దీనికి పూర్ణ చందరే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూడాలి మరి ఏమవుతుందో..!