Puri Jagannadh: ఆ ఒక్క కండీషన్ వల్లే చిరంజీవి, బాలయ్య పూరీకి ఛాన్స్ ఇవ్వలేదా?

  • May 15, 2023 / 08:14 PM IST

పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే పూరీ రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఒక సినిమా ఫిక్స్ అయింది. కొన్నిరోజుల క్రితం చిరంజీవి, బాలయ్య పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ విధంగా జరగలేదు.

పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాను పూరీ కనెక్స్ట్స్ బ్యానర్ పైనే తెరకెక్కించాలని భావిస్తున్నానని చెప్పడంతో చిరంజీవి, బాలయ్య రిస్క్ తీసుకోవాలని భావించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లైగర్ సినిమా ఎగ్జిబిటర్లు ఈ సినిమా నష్టాలను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక భారీ బడ్జెట్ సినిమాకు నష్టాలు వస్తే ఎగ్జిబిటర్లు రోడ్డెక్కడం ఈ మధ్య కాలంలో లైగర్ విషయంలోనే జరిగింది.

పూరీ కనెక్ట్స్ బ్యానర్ పేరును డ్యామేజ్ చేసేలా లైగర్ సినిమా రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రామ్ ఇచ్చిన అవకాశాన్ని పూరీ జగన్నాథ్ సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్ బోయపాటి కాంబో మూవీ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2024 సంవత్సరంలో మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

పూరీ జగన్నాథ్ టాలెంటెడ్ డైరెక్టర్ అని కథ, కథనం విషయంలో పూరీ జగన్నాథ్ చేస్తున్న పొరపాట్ల వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఇకపై కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఇతర రైటర్ల కథలతో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus