సర్ ప్రైజ్ లు సంచలనం సృష్టిస్తున్నాయిగా…!

ఈ ఏడాది సంక్రాంతి కి ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో పెద్ద బ్లాక్ బస్టర్లు దక్కాయి టాలీవుడ్ కి…! ఈ రెండు చిత్రాలు ఏకంగా 480 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్ లను రాబట్టాయి. ఇదే ఓ అద్బుతం అనుకుంటే… అసలు సినిమాలే చెయ్యను అంటూ పది సార్లు పైనే చెప్పుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. తన 26 వ సినిమాని మొదలుపెట్టాడు. అది కూడా దిల్ రాజు సినిమా… అందులోనూ ఈ మే కి విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు మరో 2 చిత్రాలని కూడా అనౌన్స్ చేసేసాడు. ఇది నిజంగా రెండో అద్బుతం అని చెప్పాలి.

These Films We're Really Made Excited in 20201

ఇక అనుకోకుండా చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో మహేష్ బాబు జాయిన్ అవ్వడం… మరో వింత. నిజానికి చరణ్ చేయాల్సిన ఈ పాత్ర కొన్ని కారణాల వల్ల మహేష్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుండడం నిజంగా ఓ అద్బుతం అనే చెప్పాలి. ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ‘మహానటి’ చిత్రానికి నేషనల్ అవార్డులు తెప్పించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 350 కోట్ల బడ్జెట్ తో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో ఓ సినిమా రూపొందనుండడం ఇంకో అద్బుతం అని చెప్పాలి. ఏమైనా 2020 మొదటి రెండు నెలలకే ఇన్ని అద్భుతాలు జరగడం విశేషం.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus