ఆత్మహత్య చేసుకున్న ‘మనసు మమత’ సీరియల్ ఆర్టిస్ట్!
- September 9, 2020 / 08:47 AM ISTByFilmy Focus
తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘మనసు మమత’ సీరియల్ ఆర్టిస్ట్ కండపల్లి శ్రావణి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్56 బ్లాక్లో గల అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారామె. మంగళవారం అర్థరాత్రి బాతోరూమ్లోకి వెళ్లి ఉరివేసుకుని శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమలో సమస్యలే ఆమె ఈ పనికి ఒడిగట్టడానికి కారణమని తెలుస్తోంది. ‘మౌనరాగం’, ‘మనసు మమత’ సహా పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రజలకు ఆమె చేరువయ్యారు.
అసలు వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరిలోని గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్టాక్ ద్వారా శ్రావణికి పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా, తరవాత ప్రేమగా మారింది. కొన్ని రోజుల నుండి అతడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

బాత్రూమ్లోకి వెళ్లిన శ్రావణి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టామని కుటంబ సభ్యులు తెలిపారు. విగతజీవిగా పడిఉన్న ఆమెను హుటాహుటిన యశోద హాస్పిటల్కు తీసుకువెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
బిగ్బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్బాస్ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?















