ఎన్టీఆర్ 27 మూవీలో ఫిక్స్ అయిన ఇద్దరు హీరోయిన్లు
- January 30, 2017 / 09:37 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీపై రోజురోజుకి క్రేజ్ పెరిగిపోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషించడం ఈ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకోవడంతో అందరి చూపు దీనిపై పడింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ కి ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాత కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.
“జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఎన్టీఆర్ సరసన నటించే భామల్లో ఇద్దరినీ ఫిక్స్ చేశారు. ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా, జెంటిల్ మాన్ భామ నివేత థామస్ ఎన్టీఆర్ 27 లో హీరోయిన్ సెలక్ట్ అయినట్లు సమాచారం. ఇక నెగటివ్ షేడ్స్ తో ఉన్న పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్ కోసం బాబీ వెతుకుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ఇంకా పది రోజులు ఉండడంతో అప్పటిలోపున మూడో హీరోయిన్ ఎంపిక పూర్తికావాలని చిత్ర బృందం గాలిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













