Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

  • April 18, 2022 / 07:14 PM IST

మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. ఒక్క పాట మినహా మిగిలిన షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యింది. ఈ పాట చిత్రీకరణ కూడా మొదలైనట్టు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. మే 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. పాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు మొదలుపెడతారు. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.

Click Here To Watch NOW

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ను కూడా ప్రకటించారు. దాదాపు ‘అల వైకుంఠపురములో’ కి పనిచేసిన టీమే దీనికి కూడా పనిచేస్తుంది. ఇదొక పొలిటికల్ టచ్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా అని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉంటుందట. విలన్ రోల్ కు దగ్గరగా ఉండే పాత్ర ఇది. అలా అని పూర్తిగా విలన్ రోల్ కాదు.

ఈ పాత్ర కోసం ఓ మలయాళం స్టార్ హీరోని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరినీ సంప్రదించడం కూడా జరిగింది. వాళ్ళు మరెవరో కాదు ‘పుష్ప’ విలన్ అయిన ఫహాద్ ఫాజిల్.. ఇంకొకరు ‘సలార్’ లో నటిస్తున్న పృద్వి రాజ్ సుకుమారన్. ఈ ఇద్దరిలో ఒకర్ని ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ లో జయరామ్ నటించాడు.

అతను కూడా మలయాళం నటుడే. మహేష్- త్రివిక్రమ్ ల మూవీని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. మలయాళం మార్కెట్ కోసం ఇలా అక్కడి స్టార్ కోసం ప్రయత్నిస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. ఈ ప్రాజెక్టుని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ పై చినబాబు,నాగ వంశీ లు నిర్మిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus