తాతగారి మరణంతో ఉపాసన భావోద్వేగ సందేశం
- May 27, 2020 / 02:08 PM ISTByFilmy Focus
మెగా కోడలు మరియు చరణ్ భార్య ఉపాసన తాతగారైన ఉమాపతి రావు కామినేని నేడు తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఉమాపతి రావు నేటి ఉదయం మరణించినట్లు తెలుస్తుంది. ఉమాపతి రావు వయసు 92 సంవత్సరాలు. ఆయన కుమారుడు అనిల్ కామినేని కాగా ఉపాసన ఉమాపతి రావ్ కి సొంత మనువరాలు. కామినేని కుటుంబంలో కురువృధుడు అయిన ఉమాపతి రావ్ కి ఘన చరిత్ర ఉంది.

కామినేని ఉమాపతి రావు దశాబ్దాల చరిత్ర కలిగిన దోమకొండ సంస్థాన వారసులలో ఒకరు. దోమకొండ కోటలోనే ఆయన జననం జరిగింది. ఇక విద్యావేత్త అయినా ఉమాపతిరావు ఐ ఏ ఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఈయన ఉర్దూ రచయిత కావడం విశేషం. ఈయన రాసిన షయారి మంచి ప్రాచుర్యం పొందింది. ఇక ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి ఈ ఓ గా ఉమాపతి బాధ్యతలు నెరవేర్చారు. ఆయన మరణంతో దిగ్బ్రాంతికి గురైన ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సోషల్ మీడియా మెస్సేజ్ పెట్టారు.

Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!














