Varalaxmi: వాయిస్ బాగాలేదని డబ్బింగ్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు!
June 28, 2023 / 09:41 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి ఎంతోమంది అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఒకప్పుడు అవమానాలను ఎదుర్కొన్నటువంటి వారందరూ కూడా అనంతరం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీలో లేడీ విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.
ఈమె ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకు కూడా కెరియర్ మొదట్లో అవమానాలు తప్పలేదు అంటూ ఈమె ఓ సందర్భంలో తనకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు.
తన (Varalaxmi) వాయిస్ చాలా గంభీరంగా ఉండటంతో నా వాయిస్ ఏ మాత్రం బాగాలేదని తనని హేళన చేశారని నాది మగవారి గొంతు లాగా ఉంటుందంటూ అవమానించారని తెలిపారు.ఇలా నా గొంతు గంభీరంగా ఉండడంతో చివరికి నేను నటించిన పాత్రలకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వకుండా నన్ను అవమానించారని ఈమె తెలియజేశారు.
ఇలా తనకు అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ముందడుగు వేశానని అయితే అభిమానులు నన్ను ఆదరించడంతోపాటు నా గొంతుని కూడా ఆదరించారని ఇప్పుడు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం తెలుగు సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.