రాశీ ఖన్నాతో కలిసి వరుణ్ లండన్ ట్రిప్
- August 9, 2017 / 08:19 AM ISTByFilmy Focus
లోఫర్, మిస్టర్ సినిమాల అపజయాలతో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్ కి ఫిదా మంచి ఉత్సాహాన్నిచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 60 కోట్లు వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ జులై నెలాఖరులో ప్రారంభమై రెండు రోజుల క్రితం ముగిసింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం సిద్ధమవుతోంది.
లండన్లోని అందమైన లొకేషన్లలో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రాశీఖన్నాలపై రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఢిల్లీ భామ రాశీ ఖన్నా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ వంటి హిట్ అందుకుంది. మళ్ళీ ఇప్పుడు మెగా హీరో వరుణ్ తో కలిసి ఈ మూవీ చేస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా పూర్తి వివరాలని చిత్ర బృందం అధికారికంగా త్వరలో వెల్లడించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














