Venkatesh, Mahesh Babu: ఆ ప్రముఖ థియేటర్ స్థానంలో ఏఎంబీ విక్టరీ.. పూజ ఎప్పుడంటే?

  • April 10, 2024 / 11:47 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వెంకటేశ్, మహేష్ పారితోషికం తగ్గించుకుని మరీ నటించారని దిల్ రాజు ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే వెంకటేశ్, మహేష్ భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

సుదర్శన్ థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చనున్నారని ఏఎంబీ విక్టరీ అనే పేరుతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు కానుందని సమాచారం అందుతోంది. ఆసియన్ సునీల్, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనుండటం గమనార్హం. గురువారం రోజున ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు థియేటర్ల బిజినెస్ లో ఉన్నారు. తొలిసారి వెంకటేష్ పేరు మీదుగా మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయనుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆసియన్ సంస్థ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతో జత కడుతూ ప్రముఖ నగరాల్లో మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ వల్ల ఆ మల్టీప్లెక్స్ లకు తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కుతోంది.

సుదర్శన్ థియేటర్ ను పడగొట్టి మల్టీప్లెక్స్ ను నిర్మిస్తారనే వార్తలు చాలా సంవత్సరాల నుంచి ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. మరోవైపు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సీక్వెల్ రావాలని వెంకటేష్, మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో సీక్వెల్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. దిల్ రాజు తలచుకుంటే సీక్వెల్ అసాధ్యం కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబోలో సినిమా ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus