సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నాళ్లుగా చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, నటి విజయ భాను వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు పార్దో ఘోష్ (Partho Ghosh) మృతి చెందారు. గుండెపోటు రావడంతో నిన్న ముంబైలోని ఆయన నివాసంలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. పార్దో ఘోష్ (Partho Ghosh) వయసు 76 ఏళ్ళు అని తెలుస్తుంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ వస్తున్నారట పార్దో ఘోష్ అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక పలువరు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి చింతిస్తూ ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ నివాళులు అర్పిస్తున్నారు. ఇక పార్దో ఘోష్ 1991 లో వచ్చిన ‘100 డేస్’ సినిమాతో దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. అటు తర్వాత ‘దలాల్’ ‘అగ్నిసాక్షి’ ‘గులాం ఏ ముస్తఫా’ ‘తీస్రా కౌన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఈయన కోల్ కతా వాసి.