తమ సినిమాను ప్రచారం చేసుకోవడంలో చాలా రకాల ఆలోచనలు చేస్తుంటాయి చిత్ర వర్గాలు. సోషల్ మీడియా వచ్చి ఎక్కువ శాతం ప్రచారం ఆన్లైన్లో చేసుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు ప్రచారం అంటే ప్రజల మధ్యలో ఉండేది. ఆ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే మళ్లీ ప్రేక్షకుల మధ్యలోకి వస్తున్నాయి. అయితే ముఖాలకు మాస్క్లు వేసుకొని ఎవరికీ తెలియకుండా సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఓ స్టార్ హీరో. దీంతో ఎంత కష్టమొచ్చింది మా హీరోకి అని ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
అసలు ఏమైందంటే.. తన సినిమాలను విభిన్నంగా ప్రమోట్ చేసుకోవడం. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందుంటాడనే విషయం తెలిసిందే. అయితే తన కొత్త సినిమా ‘హౌస్ఫుల్ 5’ (Housefull 5) కోసం మరో రకం ప్రయత్నం చేశారు. సినిమా విడుదలైన తర్వాత సినిమా మీద ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవడానికి ఏకంగా మైక్ పట్టుకుని థియేటర్లకు వద్దకు వచ్చాడు. అలా వస్తే ఎవరూ గుర్తు పట్టలేదా అనుకుంటున్నారా? ఆ మయానికి ఆయన ముఖానికి ఫుల్ మాస్క్ పెట్టుకున్నాడులెండి.
అక్షయ్కుమార్ (Akshay Kumar), అభిషేక్ బచ్చర్ (Abhishek Bachchan), రితేశ్ దేశ్ముఖ్ (Riteish Deshmukh),, జాక్వలైన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez), నర్గీస్ ఫక్రీ ( Nargis Fakhri), సోనమ్ భజ్వా (Sonam Bajwa), సంజయ్ దత్(Sanjay Dutt),, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్ఫుల్ 5’. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఇటలీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు వెర్షన్ల క్లైమాక్స్ అంటూ కాస్త ఆసక్తిని రేకెత్తించింది టీమ్. అయితే థియేటర్లలో ఆశించిన ఫలితం అయితే రాలేదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయం తెలసుకుందాం అని..
ముంబయిలోని ఓ థియేటర్ వద్దకు వెళ్లి ఈ అభిప్రాయ సేకరణ తీసుకున్నాడు అక్షయ్. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి వారి సమాధానాన్ని విన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ‘హౌస్ఫుల్ 5’ సినిమా చూసిన వారి నుండి రివ్యూలు అడిగి తెలుసుకోవాలని భావించాం. అందుకే కిల్లర్ మాస్కులు ధరించి బాంద్రాలోని థియేటర్కు వెళ్లాం అని అక్షయ్ ఆ పోస్టులో రాసుకొచ్చాడు.