Vijay Devarakonda: పూరి, ఛార్మి లకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ!

  • September 1, 2022 / 06:44 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి ప్లాపైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షోకే డిజాస్టర్ అని ప్రేక్షకులు తేల్చేశారు. ఛార్మి, కరణ్ జోహార్ లతో కలిసి పూరి కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హిందీలో ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ మిగిలిన అన్ని వెర్షన్లలో ఈ మూవీ భారీ నష్టాలు మిగల్చడం గ్యారెంటీ అని తేలిపోయింది. దాదాపు రూ.50 కోట్ల వరకు ఈ మూవీ నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూరి ఈ చిత్రం కోసం పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన వాటాలో కూడా రూ.70 శాతం వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ కూడా తన వంతు పారితోషికం వెనక్కి ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

‘లైగర్’ కోసం విజయ్ దేవరకొండ కి రూ.15 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేశారు. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా ఉంది. మొత్తంగా అతని పారితోషికం విలువ రూ.20 కోట్లని తెలుస్తుంది. ఇందులో విజయ్ రూ.6 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టు భోగట్టా. లాభాల్లో వాటా ఇంకా అతనికి ఇవ్వలేదట. అది ఇప్పుడు వద్దు అని విజయ్.. పూరి, ఛార్మి లతో అన్నట్టు తెలుస్తుంది.

విజయ్ తన నెక్స్ట్ మూవీ ‘జన గణ మన’ కూడా పూరి ఛార్మి లతోనే చెయ్యాలి. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ సాధిస్తే అప్పుడు విజయ్ లాభాల్లో వాటా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus