Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్
- February 19, 2026 / 07:34 PM ISTByPhani Kumar
రాజమౌళి తండ్రి, టాలీవుడ్ స్టార్ రైటర్, రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) నిన్న హైదరాబాద్, రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరికీ షాకిచ్చాయి.
Vijayendra Prasad
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ…”ఎన్నాళ్ళ నుండో నా మనసులో గూడుకట్టుకుని ఉన్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. మాది చాలా సంపన్న కుటుంబం.నా క్లాస్ మేట్ పేరు జాన్ ఫెడిరిక్ సుందర్ రావు. ఓ మా*ల అబ్బాయి. నాతో సమానంగా బాగా చదివేవాడు. ఇద్దరం ఎస్ ఎస్ సి పాసైన తర్వాత లయోలా కాలేజీలో చేరాము.మా నాన్నగారు ఆ అబ్బాయికి ఆర్థిక సాయం చేశారు.

నా రూమ్ మేట్ గా పెట్టారు.మా నాన్నగారికి కుల వివక్ష లేదు.నాకు తెలిసి నేను కూడా ఎలాంటి తప్పు చేయలేదు.కానీ మా తాత ముత్తాతలు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారు. అలాంటి వంశంలో పుట్టానా అని నాపై నాకే సిగ్గేస్తుంది. కానీ వాళ్ళ ఆస్తి నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది. దాని గురించి మీ అందరి ముందూ తలవంచి క్షమాపణలు కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
విజయేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సక్సెస్ఫుల్ పర్సన్ అయినప్పటికీ.. ఈరోజుకి ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. తమ కుటుంబంలో 10కి పైగా కులాలు ఉన్నాయని గతంలో కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల
నాకు తెలిసి నేనెప్పుడూ తప్పు చేయలేదు..
కానీ మా తాతలు, ముత్తాతలు నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు..!!
“దాని గురించి మీ అందరి ముందూ తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను.. క్షమించండి.. క్షమించండి”
– విజయేంద్ర ప్రసాద్ గారు
pic.twitter.com/SIyMbLS4iG— Mega Abhimani (@megaabhimani3) February 19, 2026
















