Sai Dharam Tej: పవన్ అలా చెప్పేసరికి… అభిమానుల ఆందోళన!
- September 27, 2021 / 04:30 PM ISTByFilmy Focus
సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు… త్వరలో డిశ్చార్జి అవుతాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. అయితే ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ సాక్షిగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు సాయితేజ్కి ఎలా ఉంది… దానికి సంబంధించి ఓ హెల్త్ అప్డేట్ ఇస్తే బాగుండు అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. ‘రిపబ్లిక్’ ఈవెంట్లో పవన్ ఆవేశంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
సమాజంలో ఉన్న అన్ని రకాల సమస్యల్ని వదిలేసి, సాయితేజ్ యాక్సిడెంట్ను అనాలసిస్ చేస్తూ మీడియా కథనాలు రాసింది, టెలీకాస్ట్ చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఈ క్రమంలో ‘సాయితేజ్ ఇంకా అక్కడ ఆసుపత్రిలో కోమాలోనే ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చారు పవన్. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా నిశబ్దం ఆవహించింది. సాయితేజ్ యాక్సిడెంట్ జరిగి 15 రోజులు దాటి పోయింది. తొలుత ఆరోగ్య పరిస్థితి చెబుతూ బులిటెన్లు వచ్చాయి. అంతా సేఫ్, సాయితేజ్కి ఓకే అని చెప్పి బులిటెన్లు ఆపేశారు.

దీంతో కోలుకుంటున్నాడేమో, త్వరలో బయటకు వస్తాడేమో అని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు పవన్ మాటలు చూస్తుంటే వేరేలా ఉన్నాయి. దీంతో సాయితేజ్ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

















