‘పాయింట్కి రా.. ఇదంతా వద్దు.. పాయింట్కి రా’ అని అంటుంటారు కొందరు. ఆ మధ్య ఏదో సినిమాలోని డైలాగ్ అనుకోండి ఇది. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూసి నెటిజన్లు ఇంచుమించు ఇదే అంటున్నారు. గతంలో ఇంకో వ్యక్తి కూడా ఉండేవారు కానీ.. ఆమె ఇప్పుడు ఇలాంటి పోస్టులు ఏమీ పెట్టడం లేదు. ఇప్పుడు పోస్టులు పెట్టని హీరోయిన్ సమంత (Samantha) అయితే.. పోస్టులు పెడుతున్న వాళ్లు దర్శకుడు రాజ్ (Raj Nidimoru) భార్య శ్యామాలి(Shyyamali), స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannaah). ఇంతకీ ఏమైందంటే?
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma), నటి ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలామంది చూపు ఆయన మాజీ ప్రేయసి తమన్నా (Tamannaah) పై పడింది. ఈ కొత్త ప్రేమ జంట పుకార్లపై ఆమె ఏమన్నా రియాక్ట్ అవుతుందా అని చూస్తుంటారు. ఈ సమయంలో తమన్నా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ షేర్ చేసింది. అందులో నమ్మకం గురించి, ప్రేమ గురించి ఉండటంతో ఇప్పుడు వైరల్గా మారింది. జీవితంలో అన్నీ అనుకున్న విధంగా పూర్తి కావు అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది.
ఏదైనా డిజైన్ చూసినప్పుడు అందులో తెలుపు కనిపిస్తే అది మొత్తం ఖాళీగా ఉన్నట్లు కాదు. దాని వెనుక ఏదో ఒక కారణం ఉన్నట్లు అర్థం. ప్రతి అంగుళాన్ని పూర్తి చేయలేకపోవడం కూడా ఒక రకమైన విశ్వాసమే. ఇది మన జీవితానికీ వర్తిస్తుంది. ప్రతి పని ఫలదాయకంగా ఉండకపోవచ్చు. కానీ, కొన్ని క్షణాలు ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడతాయి అని కాస్త భావుకతతో కూడిన ఓ సందేశాత్మక పోస్ట్ పెట్టింది. ఇందులో ఉన్న ఉద్దేశం ఇదే కానీ.. వెనుక ఇంకేదో ఆలోచన ఉందని అర్థమవుతోంది.
జీవితంలో అసంపూర్తి గురించి ఆమె మాట్లాడింది అని చెప్పొచ్చు. ఏదైనా చెప్పాలి అనుకుంటే.. నేరుగా చెప్పేయొచ్చు కదా ఎందుకిలా ఇన్డైరెక్ట్ పోస్టులు అనేది అర్థం కావడం లేదు. ఆమె మాత్రమే కాదు సమంత ఫ్రెండ్ (Samantha) (?) దర్శకుడు రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి కూడా ఇటీవల ఇలాంటి పోస్టులే పెడుతోంది. ఇక నాగచైతన్యతో విడిపోయే సందర్భంలో సమంత కూడా ఇదే పని చేసింది. ఏంటో ఈ స్టేటస్లు, స్టోరీల వార్.