ఇప్పుడు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ పై మోజు పడ్డారు. కాబట్టి.. రీజనల్ మూవీస్ పై కాకుండా పెద్ద స్పాన్, పెద్ద బడ్జెట్ కలిగిన సినిమాలు చేసి అన్ని భాషల్లోనూ మార్కెట్ పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళ నుండి ఒక సినిమా రావడానికి 2,3 ఏళ్ళు టైం పడుతుంది. వాళ్ళు మాత్రమే కాదు మిడ్ రేంజ్ హీరోలు సైతం పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలని చూస్తున్నారు.
ఏడాదికి 2,3 సినిమాలు తీసే హీరోలు కూడా ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల పేర్లు చెప్పి.. ఎక్కువ టైం తీసుకుంటున్నారు. మరోపక్క పేరున్న హీరోల సినిమాలు లేకపోతే థియేటర్ల పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అనే కాదు… సినిమానే నమ్ముకున్న పేద సినీ కళాకారులకి కూడా పూట గడవాలంటే.. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. అప్పుడు వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
ఉదాహరణకి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నే తీసుకుందాం. 2023 లో ఇతని నుండి 3 సినిమాలు వచ్చాయి. కానీ 2024 లో ‘క’ ఒక్కటే వచ్చింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి ‘దిల్ రూబా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాల ఫలితాల సంగతి పక్కన పెట్టేస్తే…వీటి ప్రొడక్షన్ 2022 లో మొదలైంది.
అంటే అవి బయటకు రావడానికి 2 ఏళ్ళు టైం పట్టింది. ఇప్పుడు ‘కె ర్యాంప్’ అనే సినిమా చేస్తున్నాడు. రాజేష్ దండ దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ కూడా స్లో గా సాగుతుంది. ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే కిరణ్ పై కూడా కొంత వ్యతిరేకత నెలకొంది. ఇతను అనే కాదు నాగశౌర్య (Naga Shaurya) వంటి హీరోలు కూడా ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు. 2023 లో వచ్చిన ‘రంగబలి’ (Rangabali) తర్వాత నాగశౌర్య నుండి మరో సినిమా రాకపోవడం గమనార్హం.