Akhanda 2: ప్యాటర్న్‌ మార్చలేదు.. పాన్‌ ఇండియా కోరిక యాడ్‌ చేశారు.. ఇలా వర్కవుట్‌ అవుతుందా?

హ్యాట్రిక్‌ కొట్టి.. ఇప్పుడు సెకండ్‌ హ్యాట్రిక్‌ స్టార్ట్‌ చేయడానికి సిద్ధయ్యారు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను. డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ అంటూ సినిమాను రెడీ చేశారు. రిలీజ్‌ కోసం ప్రచారం కూడా చేసేస్తున్నారు. దీనికి సంబంధించి సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం భారీ స్థాయిలో విడుదల చేసింది. దానిని చూస్తే సినిమా ఎలా ఉండబోతోంది, ఏ కాన్సెప్ట్‌లో సాగబోతోంది అనే విషయాలను క్లియర్‌గా చెప్పేశారు బోయపాటి శ్రీను. క్లియర్‌గా చెప్పేశారు అనేకంటే గతంలో చేసిన ప్రయత్నాలే మరోసారి చేస్తున్నారు అని చెప్పారు.

Akhanda 2

బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ ఆ సినిమాలు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ‘అఖండ 2: తాండవం’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. దీంతో ఈ సినిమా ఫలితం బాలకృష్ణకు రెండు విధాలా కీలకం. మరోవైపు ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా లైన్‌ ఉందా? అనేదే ప్రశ్న.

ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే తొలుత కలిగే అభిప్రాయం కొత్తగా ఏముందని చూస్తే.. అంతగా కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు అని చెప్పొచ్చు. ఏంటీ ట్రైలర్‌ చూసి ఆ మాట అనేస్తారా అని అనుకుంటున్నారా? మామూలుగా అయితే ట్రైలర్‌ చూసి చెప్పడం కష్టమే. కానీ ఈ ట్రైలర్‌ కట్‌ చూస్తుంటే ఓ చిన్నారికి ఇచ్చిన మాట కోసం ‘అఖండ’ వచ్చి ఎలా కాపాడాడు, ఆ చిన్నారికి వచ్చిన కష్టం ఏంటి అనేదే కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

దానికి హైంధవ ధర్మం, విదేశాల ఉగ్రవాదం, మన దేశంలో కుతంత్రాలు చేసే ఓ బ్యాచ్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మామూలుగా అయితే ఇది రెగ్యులర్‌ మాస్‌ కమర్షియల్‌ సినిమా లైన్‌. ఇలాంటి కథతో పాన్‌ ఇండియా స్థాయలో రిలీజ్‌ అంటే ఆలోచించాలి. అయితే హైందవ ధర్మం, దేశ రక్షణ లాంటి అంశాలు ఆసక్తికరం కాబట్టి ఫలితం చూడాలి.

రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus