ఒక్క కట్ కూడా లేకుండా ‘యాత్ర’ సెన్సార్ పూర్తయ్యింది..!

  • January 23, 2019 / 08:44 AM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యాత్ర’. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ‘వైఎస్ఆర్’ పాత్రలో… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మెయిన్ పాయింట్ గా… మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. బయోపిక్ కావడంతో… ఈ చిత్రానికి సెన్సార్ అంత సులువుగా జరగదని, చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ‘యూ’ సర్టిఫికెట్ రావడం పై ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ఫిలింనగర్లోనూ చర్చ మొదలయ్యింది.

ఇక ఈ చిత్రం చాలా బాగుందని సెన్సార్ బోర్డు సభ్యులు పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు మెంబర్స్ ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ను అభినందించారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి అద్భుతంగా చేసారంట… రావు రమేష్ సహాయ పాత్ర కూడా చాలా బాగా వచ్చిందట. ఈ చిత్రంలో డైలాగులు చాలా బాగున్నాయట. సుహాసిని, జగపతి బాబు పత్రాలు కూడా చాలా బాగా వచ్చాయట. ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 6 నిమిషాలే కావడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ‘భలే మంచిరోజు’ ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించినట్టు.. నిర్మాణ విలువలు చెబుతున్నాయి.

‘ఆనందో బ్రహ్మ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ ఈ చిత్రాన్ని కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారట. పాటలకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడం… డైరెక్టర్ గత చిత్రంలో మాదిరి ఈ చిత్రంలో కామెడీ ఉండకపోవడం వంటివి కొన్ని మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 8న ఇది విడుదల కాబోతుంది. చాలా కాలం తరువాత మమ్ముట్టి నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడంతో ఈ చిత్రం పై క్రేజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లతో అది స్పష్టం అవుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus