ఇంకా కరోనా నుండి కోలుకొని ఎంపీ నవనీత్ కౌర్!
- August 16, 2020 / 04:26 PM ISTByFilmy Focus
కోవిడ్ మహమ్మారి దేశంలో ఇప్పటికే వేలమందిని పొట్టనపెట్టుకోగా, అనేక మంది ప్రముఖులు సైతం కరోనా కారణంగా మరణించడం జరిగింది. ఇక అమితాబ్ కుటుంబం కరోనా సోకి కోలుకున్నారు. టాలీవుడ్ లో రాజమౌళి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. రెండు వారాల చికిత్స అనంతరం వారు ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంకి కూడా కరోనా సోకగా, ఆయన విషమ పరిస్థిని ఎదుర్కొంటున్నారు. చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
కాగా మాజీ హీరోయిన్ మరియు పార్లమెంట్ మెంబర్ నవనీత్ కౌర్ ఆరోగ్యం విషయమంగా ఉంది. ఆమెతో పాటు కుటుంబంలోని 12మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడటంతో నాగపూర్ తరలించారు. అప్పటికి కూడా ఆమె కోలుకునే పరిస్థితి కనిపించలేదు. ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఆమె క్రిటికల్ కండీషన్ లో ఉన్నారట. అనేక భాషలలో నటించిన నవనీత్ కౌర్ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేశారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో ఓ పాటకు ఈమె స్టెప్స్ వేశారు. 2011లో వివాహం చేసుకున్న ఈమె, రాజకీయాలలోకి వెళ్లడం జరిగింది. 2019 ఎన్నికలలో అమరావతి పార్లెమెంట్ స్థానం నుండి నవనీత్ ఎంపీగా గెలిచారు.
Most Recommended Video
నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?
















