అఖిల్ మూవీకి నిర్మాతగా రామ్ చరణ్
- December 23, 2016 / 11:37 AM ISTByFilmy Focus
ధృవ ఇచ్చిన విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలా ఆనందంలో ఉన్నారు. తనకి హిట్ ఇచ్చిన డైరక్టర్ సురేందర్ రెడ్డి కి మంచి గిఫ్ట్ ఇచ్చారు. ధృవను తెరకెక్కించిన విధానం నచ్చి తన బ్యానర్లోనే సినిమా చేసే అవకాశం ఇచ్చారు. చెర్రీ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించిన విష్యం అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్లో తొలి సారి మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. వెంటనే మరో సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు.
తన స్నేహితుడు అక్కినేని అఖిల్ ని హీరోగా పెట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ చేయడం ఖరారు అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం అఖిల్ ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్తో చేయడానికి ఫిక్సయ్యారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రీసెంట్ గా సురేందర్ రెడ్డి చెప్పిన లైన్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సూరి అఖిల్ కోసం స్క్రిప్ట్ పనిలో బిజీ కానున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















