Priyanka Jain: ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో..తేజస్విని!

  • December 1, 2023 / 05:55 PM IST

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభించారు. ఇందులో ఎవరూ ఊహించని కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు షాకింగ్ ఎలిమినేషన్లు చూపిస్తున్నారు. దీంతో ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ఈ సీజన్‌కు గతంలో కంటే ఎక్కువ స్పందన వస్తోంది. ఈ షో ప్రస్తుతం 13వ వారం సక్సెస్ పుల్ గా నడుస్తోంది. అయితే ఈ సీజన్ లో స్టార్ మా బ్యాచ్ అని పిలువబడే అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చారు.

వీళ్లు మొదటి నుంచి కూడా కలిసి అడుతున్నారని ప్రేక్షకులందరి అర్ధం అయింది. 13వ వారం వచ్చిన కూడా వాళ్లు కలిసే అడుతున్నారు. నాగార్జున కూడా వాళ్లను సీజన్ మొత్తం కూడా కలిసే అడతారని అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తరవాత వారంలో వీళ్ల మధ్య గోడవలు పెట్టే గేమ్స్ బిగ్ బాస్ పెట్టారు. అయితే బిగ్ బాస్ ఊహించినట్లే వారి మధ్య గోడవలు జరిగాయి. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక చేసిన అందరిని షాక్ కి గురి చేసింది.

ఫినాలే అస్త్ర లో ప్రియాంక (Priyanka Jain) ఓడిపోయి మొదటి నుండి కలిసి ఉన్న అమర్ దీప్ కి ఇవ్వకుండా గౌతమ్ తనని కెప్టెన్ ని చేసాడు కాబట్టి, ఆయనకీ ఈమె పాయింట్స్ ఇవ్వాలి అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ రెండో సారి కూడా అర్జున్ కి ఇవ్వాలని అనుకోవడం చాలా తప్పు అంటు నెటిజన్లు కామంట్స్ చేశారు. మొదటి వారం నుండి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడైన అమర్ దీప్ కనీసం తనకి రెండవ ఛాయస్ గా కూడా కనిపించలేదా అని అమర్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అయ్యారు.

అమర్ కూడా ఈ విషయం పై చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. దీనికి ఇంస్టాగ్రామ్ లో అమర్ దీప్ ఫ్యాన్స్ జరిగిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చెయ్యగా, దానిని అమర్ దీప్ భార్య తేజస్విని తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. ‘బలంగా నిలబడు..ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus