Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా
- June 24, 2026 / 06:00 AM ISTByPhani Kumar
‘పెద్ది'(Peddi) సినిమాని హీరో రామ్ చరణ్, నిర్మాత, దర్శకుడు ఎంత మోస్తున్నారో తెలీదు కానీ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ మాత్రం బాగా మోస్తున్నాడు అని చెప్పాలి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ‘పెద్ది’ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లపై విరుచుకుపడుతున్నాడు. మొదటి సక్సెస్ మీట్లో ‘వినోదాన్ని ఎలా చూడాలో తెలీక కొంతమంది పైశాచికత్వంతో ‘పెద్ది’ పై విషం చిమ్ముతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు అనంత్ శ్రీరామ్. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూడా అనంత్ శ్రీరామ్ పాల్గొన్నాడు.
Peddi
అప్పుడు ‘పెద్ది’ కోసం రాసిన ఐటెమ్ సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ గురించి ప్రశ్నించగా.. వాటిని తిప్పికొట్టే క్రమంలో ‘ఐటెమ్ సాంగ్ ని ఎంజాయ్ చేయకుండా లిరిక్స్ ని ట్రోల్ చేసే వాళ్ళే ఐటెమ్ గాళ్ళు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అలాగే హీరోయిన్ సీన్స్ విషయంలో బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడాన్ని కూడా ఖండించాడు. అంతేకాదు తర్వాత అతను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ‘ ‘పెద్ది’ పై కావాలనే కుట్రపన్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఈరోజు శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో అయితే ” ‘పెద్ది’ 420 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది.ఇవి వసూళ్లు కాదు… వసూళ్ల వరద. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్లకు సరదా తీర్చేసిన అభిమానులు మీరు.అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా ‘పెద్ది’ బృందం మొత్తం ఇక్కడికి వచ్చింది” అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు అనంత్ శ్రీరామ్. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
మెగా అభిమానులు అనంత్ శ్రీరామ్ ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. మిగతా హీరోల అభిమానులు మాత్రం అతని వ్యాఖ్యలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష
‘పెద్ది’ రూ.420 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది
ఇవి వసూళ్ళు కాదు.. వరద
ఈ వరద మీద బురద జల్లాలని చూసిన వాళ్ళ సరదా తీర్చేసిన అభిమానులు మీరు: అనంత్ శ్రీరామ్#PEDDI #RamCharan #JanhviKapoor #BuchiBabuSana pic.twitter.com/usOyaf4CVB
— Filmy Focus (@FilmyFocus) June 23, 2026
















