రీరిలీజ్ అనగానే ప్రేక్షకులకు ఎందుకో తెలియని ఆనందంగా వేసేస్తుంది. అందకే ఈ ట్రెండ్ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కూడా ఈ దిశగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పనిలో పనిగా తమ టాలెంట్ని ప్రదర్శిస్తూ సినిమాను మళ్లీ చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలా ఇప్పుడు రాజమౌళి (S. S. Rajamouli) అండ్ కో. కూడా కొత్త ఆలోచన చేస్తోందట. ‘బాహుబలి’ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతోందట. ‘బాహుబలి’ ( Baahubali) అంటే ఒకటో పార్టా, లేక రెండో పార్టా అని అడగొద్దు.
ఎందుకంటే రెండు పార్టులు కలిపి రిలీజ్ చేస్తారట. అవును, సినిమా రెండు పార్టుల్ని కలిపి ఒక్కటే చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. నిడివి కాస్త ఎక్కువైనా రెండూ కలిపేసి రిలీజ్ చేస్తే ప్రేక్షకుడికి కొత్త అనుభూతి పక్కా అని భావిస్తున్నారట. ఈ క్రమంలో మరోసారి రాజమౌళి తన టీమ్తో కలసి రెండు సినిమాలను ఒక్క సినిమాగా మార్చే ఎడిటింగ్ పని పెట్టుకున్నారట. అంతా అనుకున్నట్లుగా జరిగి..
ఫైనల్ అవుట్పుట్ రెడీ అయితే రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. దీనికి ప్రధానమైన అడ్డు నిడివి అనే చెప్పొచ్చు. దీంతో అవసరమైతే రెండు ఇంటర్వెల్స్ ఇచ్చే ఆలోచన చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ (Baahubali 2) కలిపితే మొత్తంగా 5 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఎంత తెగ్గొడితే సినిమా తగ్గుతుంది అనేది చూడాలి. ఒకవేళ రెండూ కలిపితే ‘బాహుబలి: ది కంప్లీట్’ అవుతుంది అని చెప్పాలి.
ఇలా వస్తే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు మళ్లీ వచ్చి సినిమా చూస్తారు అని చెప్పాలి. అయితే ఇక్కడే మరో డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు తగ్గించగలిగితే అప్పుడే ఒక్క పార్టు చేసి ఉంటే బాగుండేది కదా అని. ఈ సినిమా ప్రచారం కోసం రాజమౌళి బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురవుతుంది అని చెప్పొచ్చు. చూద్దాం ఆయన ఏమంటారో?