కోలీవుడ్ స్టార్ హీరో ‘జయం’ రవి (Jayam Ravi) విడాకుల వ్యవహారం దేశమంతా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు జయం రవి. అయితే ఆర్తి ఈ విషయం నాకు తెలీదని.. తన ప్రమేయం లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా ఎలా తనకు విడాకులు ఇస్తాడని ఆమె కోర్టులో విన్నవించుకుంది. అందుకు ‘జయం’ రవి… ‘నన్ను ఆమె మానసికంగా వేధిస్తుంది, నా ఇద్దరు పిల్లలను దూరం చేసి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసింది.
అందుకే నాకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను’ అంటూ జయం రవి కోర్టులో వేడుకోవడం జరిగింది. తర్వాత ఆర్తి కూడా ‘అందుకు ఒప్పుకుంటున్నాను .. కాకపోతే నెలకి రూ.40 లక్షలు భరణం కావాలి’ అంటూ డిమాండ్ చేసింది. దీనికి ముందు గాయని కెనీషా ఫ్రాన్సిస్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల తనని, పిల్లల్ని పట్టించుకోవడం లేదని, ఇందుకు నిలదీస్తే టార్చర్ చేస్తున్నాడని..
పిల్లలు ఎదుగుతున్న టైంలో ఇలాంటివి తగదని విన్నపించుకున్నట్టు కూడా ఆర్తి తెలిపింది. వాళ్ళకోసమే రూ.40 లక్షల భరణం ఆమె డిమాండ్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. రవి మోహన్ అదే జయం రవి సైలెంట్ గా 2వ పెళ్ళి చేసుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కెనీషా ఫ్రాన్సిస్, జయం రవి..
మేడలో పూల దండాలు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో సైలెంట్ గా వాళ్ళు పెళ్ళి చేసుకున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్ళి చేసుకోవడం సాధ్యం కాదు కదా అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.