తనయుడు మోక్షజ్ఞతో కలిసి నటిస్తానని చెప్పిన బాలకృష్ణ
- January 19, 2017 / 10:37 AM ISTByFilmy Focus
నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఈ ఏడాది తీరబోతోంది. 2017లో తన వారసుడి మూవీ ఉంటుందని బాలయ్య గతంలో స్పష్టం చేశారు. నిన్న కూడా ఈ విషయంపై మాట్లాడారు. ‘‘మోక్షజ్ఞను ఈ ఏడాది వెండితెరకు పరిచయం చేద్దామనుకుంటున్నా. దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలీదు. ప్రస్తుతం నటనకు సంబంధించిన మెలకువలు నేర్చుకుంటున్నాడు” అని వివరించారు.
కొడుకుతో కలిసి నటిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “నేను మోక్షజ్ఞ కలిసి నటించగల కథ ఒక్కటే ఉంది. అదే ఆదిత్య 369’కి సీక్వెల్ ‘ఆదిత్య 999’. ఈ స్టోరీలో మా ఇద్దరికీ సూటయ్యే పాత్రలున్నాయి. అందుకే ఆ సినిమా చేస్తాం. ఎప్పుడన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను” అని బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణ వీరోచితంగా నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి అత్యంత వేగంగా వందకోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో బాలయ్య తో పాటు, చిత్ర బృందం మొత్తం ఆనందంగా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















