Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు గుబులు.. ఏమైందంటే?

  • November 29, 2021 / 12:13 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లపై నెటిజన్లు బోయపాటి శ్రీనును ట్రోల్ చేశారు. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమా చరణ్ కెరీర్ కు మైనస్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు.

గుండెల మీద చెయ్యి వేసుకుని అభిమానులు వినయ విధేయ రామ సినిమా చూడవచ్చని బోయపాటి శ్రీను స్టేట్ మెంట్ ఇచ్చారు. అభిమానులు తనను నమ్మాలని బోయపాటి శ్రీను చరణ్ ఫ్యాన్స్ కు సూచించారు. అయితే వినయ విధేయ రామ నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది. అప్పట్లో బోయపాటి స్పీచ్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.

అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బోయపాటి స్పీచ్ అదే విధంగా ఉండటం గమనార్హం. అఖండ సినిమాను గుండెల మీద చెయ్యేసుకుని చూడండంటూ బోయపాటి చేసిన కామెంట్లు బాలయ్య ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. బోయపాటి శ్రీను అఖండ ఈవెంట్ స్పీచ్ వినయ విధేయ రామ స్పీచ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే అఖండ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో అఖండ మూవీ రిలీజ్ కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus