‘బాహుబలి 2’ గురించి సెన్సార్ సభ్యులు చెప్పిన విశేషాలు
- April 27, 2017 / 01:00 PM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అయ్యేది రేపే, అయినా బాలీవుడ్ లో మినహా కొన్ని గంటల్లో స్పెషల్ పెయిడ్ షోలు అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించనున్నారు. అయితే దీనిని రెండు రోజులకు ముందే చూసే అవకాశం సెన్సార్ సభ్యులకు దక్కింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కళాఖండాన్ని చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. జక్కన్న ఆలోచన శక్తిని అభినందించక ఉండలేకపోతున్నారు. అంతేకాదు సినిమా గురించి కొన్ని సంగతులను సెన్సార్ బోర్డు సభ్యుడొకరు జాతీయ పత్రికతో షేర్ చేసుకున్నారు. బాహుబలి మొదటి భాగం కంటే రెండో భాగం ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని చెప్పారు.
“మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంది. ఉత్కంఠభరితంగా సాగే కథనం వల్ల సమయమే తెలియలేదు. సింగిల్ ఫ్రేమ్, షాట్, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్ చెప్పలేకపోయాం. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా సినిమా మొదలు నుంచి చివరి వరకు ఆనందిస్తారు.’అని తెలిపారు. ఇంకా ప్రభాస్, రానా నటన గురించి మాట్లాడుతూ ‘రెండు సింహాలు తలపడినట్టు ప్రభాస్, రానా నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు.” అని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















